కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ను సంస్థ యాజమాన్యం చెల్లించింది. శనివారం మధ్యాహ్నం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో అడ్వాన్స్ మొత్తం జమచేసింది. పర్మినెంట్ ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ కింద రూ.25 వేలు చొప్పున చెల్లించగా, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.12,500 చొప్పున వారి ఖాతాల్లో జమచేసింది.
ముందస్తు అడ్వాన్స్ పొందిన ఉద్యోగులు పది ఇన్స్టాల్ మెంట్లలో తిరిగి యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంటుంది.