మేడారం జాతరలో ఈ–హుండీలు

మేడారం జాతరలో ఈ–హుండీలు

సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా మేడారంకు భక్తుల రద్దీ పెరిగింది. జాతర ప్రారంభమయ్యాకా మరింత రద్దీ పెరిగే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలకు భక్తులు కానుకలు సమర్పించేందుకు e-హుండీలను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఎక్కడి నుంచైనా కానుకలు చెల్లించేందుకు అవకాశం ఉంది. కానుకలు చెల్లించకునేందుకు QR కోడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ QR కోడ్ అందరికి తెలిసేలా జంపన్న వాగు, మేడారం గద్దెలు, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర  QR కోడ్ లను ఏర్పాటు చేసారు. e-హుండీతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గర కూడా హుండీలను ఏర్పాటు చేయనున్నట్లు మేడారం దేవదాయ శాఖ ఈఓ రాజేంద్రం చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

బీజేపీకి జోష్.. పార్టీలో చేరిన  WWE  ద గ్రేట్ ఖలీ