దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏంటనిప్రతి పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి

దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏంటనిప్రతి పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి
  •     మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

శంషాబాద్, వెలుగు: దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏంటని ప్రతి పౌరుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ముచ్చింతల్​లోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో భూభారతి ఆర్ఓఆర్ లైసెన్స్ డ్ సర్వేయర్ శిక్షణార్థులతో సోమవారం ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. రైతులు, మహిళలు, యువతలో నైపుణ్య శిక్షణకు స్వర్ణ భారత్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 

చిత్తశుద్ధితో చేసే సేవలు సంతృప్తినిస్తాయని సూచించారు. రైతుల పట్ల సానుకూల దృక్పథంతో సర్వేయర్లు సుస్థిర అభివృద్ధికి దోహదపడగలరన్నారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, గురువును మరువకూడదని, ఆరోగ్యకర జీవనశైలి, యోగ, వ్యాయామం, ఆహార క్రమశిక్షణ ముఖ్యమని సూచించారు. కార్యక్రమంలో ముప్పవరపు హర్షవర్ధన్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.