
- నిలిచిన రాకపోకలు
జడ్చర్ల, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పోలేపల్లి రంగనాయకుల చెరువు అలుగుపారుతోంది. దీంతో పోలేపల్లి, కిష్టారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రంగనాయకుల చెరువులోకి ఉదండాపూర్ రిజర్వాయర్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి ఉధృతి పెరిగింది. ఆదివారం జీపీ సెక్రటరీ లక్ష్మీనారాయణగౌడ్మాట్లాడుతూ.. రెండు గ్రామాల మధ్య ప్రజలు రాకపోకలు సాగించకుండా రోడ్డుపై అడ్డంగా ముళ్ల కంచె వేసినట్లు తెలిపారు.