భూమి.. 71 శాతం నీళ్లతో నిండి, 29 శాతం మాత్రమేనేల కలిగిన నీలి ప్రపంచం. కానీ, ఒకప్పుడు అది నీలిమండలం కాదు.. నీటి ప్రపంచం అని చెబుతున్నారు సైంటిస్టులు. 320 కోట్ల ఏళ్ల క్రితం భూమండలం మొత్తం ఓ మహా సంద్రంగా ఉండేదని, మొత్తం నీటితోనే నిండి ఉండేదని అంటున్నారు. అప్పుడు ఖండాలే వీలేవని చెబుతున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ సైంటిస్టులు స్టడీ చేసి ఈ విషయాన్ని చెబుతున్నారు.ఆస్ట్రేలియా రాళ్లపై స్టడీ ఈ విషయాన్ని చెప్పేందుకు ఆస్ట్రేలియాలోని పనోరమా ఎడారిలో ఉన్న కొన్ని కొండ రాళ్లను సైంటిస్టులు సేకరించారు. 320 కోట్ల ఏళ్ల క్రితం ఆ రాళ్లు సముద్ర గర్భంలో ఉండేవని చెబుతున్నారు.అక్కడి నుంచి దాదాపు వంద రాళ్లను తీసుకున్న సైంటిస్టులు, వాటిలోని ఆక్సిజన్ 18, ఆక్సిజన్ 16 అనే ఐసోటోపులపై రీసెర్చ్ చేశారు. ఆ రాళ్లలో ఆక్సిజన్ 16 కన్నా ఆక్సిజన్ 18 ఐసోటోపులు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఒకప్పుడు సముద్రాల్లో ఈ రకం ఐసోటోపులే ఎక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ రెండు ఐసోటోపుల మధ్య భారంలో తేడా కొద్దిగే అయినా,సెన్సిటివిటీలో మాత్రం చాలా తేడా ఉంటుందని,ఆక్సిజన్ 18 సూపర్ సెన్సిటివ్ అని చెప్పారు. ఆక్సిజన్ 18 ఎక్కువగా ఉందంటే , ఆ టైంలో నేల అనేది అసాధ్యమని తేల్చారు. అయితే, అక్కడక్కడా నేల ఉండి ఉండొచ్చని చెప్పారు. వాళ్ల స్టడీని మరింత ముందుకు తీసుకుపోయేందుకు అరిజోనా నుంచి దక్షిణాఫ్రికా వరకు విస్తరించి ఉన్న రాళ్ల నమూనాలను తీసుకోవాలని నిర్ణయించారు. వాటినీ స్టడీచేసి భూమి రహస్యాలను ఛేదించే పనిలో పడ్డారు.తద్వారా భూమిపై జీవం ఆవిర్భావంలోని మరిన్ని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
320 కోట్ల ఏళ్ల క్రితం భూమంతా నీళ్లేనంట
- విదేశం
- March 4, 2020
లేటెస్ట్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన