సోలమన్ దీవుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.0గా నమోదు అయ్యింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం 12.55 నిమిషాలకు భూమి కంపించింది. ఆస్ట్రేలియాకు తూర్పు దిశగా సోలమన్ దీవులు ఉన్నాయి. ఇండియాలో కూడా ఇవాళ పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్లోని నాగౌర్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 3.0 తీవ్రతతో భూమి కంపించినట్లు ఐఎండీ ట్విట్టర్లో తెలిపింది.
