ఢిల్లీలో మళ్లీ భూ ప్రకంపనలు

ఢిల్లీలో మళ్లీ భూ ప్రకంపనలు

ఢిల్లీలో గత రాత్రి భూమి మళ్లీ కంపించింది. రాత్రి 10:42 గంటలకు నోయిడాలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లలో భూ ప్రకంపనలు సంభవించాయని…19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు NCS చెప్పింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని తెలిపింది. ఢిల్లీలో భూమి కంపించడం నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి.