గుజరాత్లో భూకంపం.. 4.3 తీవ్రతతో ప్రకంపనలు

గుజరాత్లో భూకంపం.. 4.3 తీవ్రతతో ప్రకంపనలు

గుజరాత్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. మధ్యాహ్నం 3:21గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. రాజ్కోట్కు 270 కిలోమీటర్ల దూరంలో భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గతవారం సైతం గుజరాత్ ఆమ్రేలీ జిల్లాల్లో రెండు రోజుల్లో మూడు భూ ప్రకంపనలు నమోదయ్యాయి.