మంత్రి పదవి ఇచ్చి బానిసలెక్క బతకమంటే బతుకుతనా?

మంత్రి పదవి ఇచ్చి బానిసలెక్క బతకమంటే బతుకుతనా?

తనకు మంత్రి పదవి ఇచ్చి బానిసలెక్క బతకమంటే బతుకుతనా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. భూకబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ ప్రభుత్వ నుంచి బర్తరఫ్ చేయబడిన ఆయన శుక్రవారం తన పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

నీకు దిక్కులేనప్పుడు సాయపడ్డవారు ఇప్పుడు శత్రువులయ్యారా అని సీఎం కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారు. ఇంటిలాంటి పార్టీలో ఉన్నవాళ్లు బయటకు వెళ్లారని.. బయటోళ్లు ఇప్పడు కేసీఆర్‌కు గొప్పోళ్లు అయ్యారా అని ఈటల అన్నారు. నీ పార్టీలో ఒక్క మంత్రి అయినా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఉందా అని ఈటల ప్రశ్నించారు. పదవులు మస్కా కొడితే రాలేదని.. రక్తం చిందించి కొట్లాడితే వచ్చినయ్ అని ఈటల అన్నారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తదని చెప్పిడం పార్టీ వ్యతిరేకమా? అని ఆయన ప్రశ్నించారు.