స్మార్ట్​ ఫోన్లోనే  అభ్యర్థుల డేటా..  కొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్

స్మార్ట్​ ఫోన్లోనే  అభ్యర్థుల డేటా..  కొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్

దేశవ్యాప్తంగా ఎన్నికల హడ వుడి మొదలైంది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారా.. ఎవరు ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు.. వారికి ఏమైన నేర చరిత్ర ఉందా..  ఎవరికి ఓటేస్తే  ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి.. అనే విషయాలను  కచ్చితంగా ఓటరు తెలుసుకోవాలి. ఈ క్రమంలో ఎన్నికల బరిలో పోటీచేసే అభ్యర్థుల వివరాలను ప్రజలు తెలుసుకొనేందుకు ఎన్నికల కమిషన్​ కొత్త చర్యలు చేపట్టింది.  

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీ ల్లో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నా రని జనాలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ నియో జకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. అభ్యర్థుల ప్రొఫైల్ తో పాటు అతడు, ఆమెపై ఉన్న వివిధ కేసులు, నేర చరిత్ర వివ రాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. వాస్తవానికి లోక్ సభ ఎన్ని కల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయన ఈ యాప్ ను విడుదల చేశారు. ‘నో యువర్ క్యాండిడేట్ కేవైసీ పేరుతో ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందు బాటులో ఉంది.

ఆండ్రాయిడ్ వినియోగదారులతో పాటు ఐఓఎస్ వినియోగ దారులకూ ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతీ ఓటరుకు తన నియోజక వర్గంలో పోటీపడుతున్న అభ్యర్థుల గురించి తెలుసు కునే హక్కు ఉందని ఆయన అన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలనే దానిపై ఓటర్ కు స్పష్టత వస్తుం దని, సరైన అభ్యర్థిని ఎన్నుకునే వెసులుబాటు ఓటర్లకు కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు..