ఎకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్ రీఎంట్రీ.. ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీ20లకు ఇంగ్లండ్ టీమ్ ప్రకటన

ఎకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్ రీఎంట్రీ.. ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీ20లకు ఇంగ్లండ్ టీమ్ ప్రకటన

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: స్వదేశంలో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఈసీబీ) 14 మందితో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ప్రకటించింది.  స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్ జట్టులోకి తిరిగి వచ్చింది. 26 ఏండ్ల ఎకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొడ కండరాల గాయం కారణంగా కొన్నాళ్లుగా డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉంది.  

కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివర్ బ్రంట్​, హెడ్ కోచ్ చార్లెట్ ఎడ్వర్డ్స్ కు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి సవాల్ ఎదురుకానుంది. ఇండియాతో ఆడేందుకు తాము ఎదురు చూస్తున్నామని ఎడ్వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటైన టీమిండియాతో తమకు పెద్ద సవాల్ తప్పదని అభిప్రాయపడింది. ఈ నెల 28న ట్రెంట్ బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షురూ అవుతుంది.  

రెండో టీ20 జులై 1న బ్రిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, మూడో టీ20  జులై 4న ఓవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగనున్నాయి. నాలుగో, ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జులై 9, 12 తేదీల్లో ఓల్డ్ ట్రాఫోర్డ్, ఎడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. టీ20లు ముగిసిన తర్వాత ఇరు జట్లూ మూడు వన్డేల్లోనూ తలపడతాయి. 

 
ఇంగ్లండ్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సివర్-బ్రంట్ (కెప్టెన్), ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమోంట్ ( కీపర్), లారెన్ బెల్, అలిస్ క్యాప్సీ, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లారెన్ ఫిల్లర్, అమీ జోన్స్ (కీపర్), పేజ్ స్కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్, ఇసీ వాంగ్.