తెలంగాణ ప్రభుత్వానికి ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డు

తెలంగాణ ప్రభుత్వానికి ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో  ఉత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డును అందించింది. ఈ దిశలో అమలు చేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నందుకు ఈ అవార్డు ఇచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్‌ కాంక్లేవ్‌ 2022’లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ పాల్గొని అవార్డును అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసినట్లు టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. ఈ కాంక్లేవ్ లో కేటీఆర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉందన్నారు.