రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఆధారంగానే సోదాలు: ఈడీ

రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఆధారంగానే సోదాలు: ఈడీ

గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ 2013లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సోదాలు చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. రాష్ట్రంలోని గ్రానైట్ ఏజెన్సీల్లో సోదాలపై ఈడీ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.  ఈ గ్రానైట్ సంస్థల పదేళ్ల ఎగుమతి డేటాను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైనా సంస్థల నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా చేతి రుణాల రూపంలో ఇక్కడి సంస్థలకు డబ్బులు మళ్లినట్లు గుర్తించామన్నారు.   రైల్వే నుంచి ఓడ రేవుల ద్వారా గ్రానైట్ ను తరలించినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. 

ఈ నెల 9, 10తేదీల్లో జరిగిన తనిఖీల్లో భాగంగా..  కోటి 8 లక్షలనగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. చైనా, హాంకాంగ్, సింగపూర్ తో పాటు మరికొన్ని దేశాలకు అక్రమంగా గ్రానైట్ ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎగుమతి పన్నులను ఎగవేస్తూ అడ్డదారిలో డబ్బు పొందినట్లు ఆధారాలు సేకరించినట్లు ప్రకటనలో తెలిపింది ఈడీ. శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీస్, శ్రీ వేంకటేశ్వర గ్రానైట్స్..పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిజా షిప్పింగ్ ఏజెన్సీస్.. హవాలా కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఈడీ పేర్కొంది. ఈ గ్రానైట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పేరుతో బినామీ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. గ్రానైట్ దందాలో చైనా హవాలాపై ఆరా తీస్తున్నట్లు ఈడీ తెలిపింది.