న్యూఢిల్లీ: లోన్యాప్ల పేరిట చైనా యాప్ల అక్రమ దందాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం బెంగళూరులో పలుచోట్ల రెయిడ్స్ నిర్వహించింది. పేటీయం ఆఫీసులో అధికారులు సోదాలు చేశారు. పేటీయంతో పాటు రేజోర్పే, క్యాష్ఫ్రీ కంపెనీల ఆఫీసులు సహా సిటీలో ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు.
చైనా వ్యక్తుల కంపెనీల పేరుతో వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.17 కోట్ల నగదును గుర్తించినట్లు తెలిపారు. చైనా కంపెనీలు తప్పుడు డాక్యుమెంట్లు, డమ్మీ డైరెక్టర్ల పేరుతో మన దేశంలో లోన్ యాప్లను నిర్వహిస్తున్నాయని అధికారులు చెప్పారు. వేర్వేరు మర్చంట్ ఐడీలు, ఖాతాలు, తప్పుడు అడ్రస్లతో ఈ దందా నడిపిస్తున్నట్లు వివరించారు.
లోన్ యాప్ వేధింపులకు సంబంధించి ఒక్క బెంగళూరు సిటీలోనే కనీసం 18 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. కాగా, ఈడీ తనిఖీలపై రేజోర్ పే, క్యాష్ఫ్రీ కంపెనీల ప్రతినిధులు స్పందించారు. అధికారులకు సహకరిస్తున్నట్లు వివరించారు. అయితే, పేటీయం ప్రతినిధులు మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.