- నిందితుల్లో ఒకరి కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్
హైదరాబాద్, వెలుగు: నేపాల్తో పాటు దేశ సరిహద్దుల్లో క్యాసినో నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన చీకోటి ప్రవీణ్కుమార్, మాధవరెడ్డిల ఇండ్లు, ఆఫీసులపై ఎన్ ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. భారత్నేపాల్సరిహద్దులు, శ్రీలంకలో క్యాసినో నిర్వహిస్తూ మనీలాండరింగ్చేస్తున్నారన్న ఆరోపణలతో హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సైదాబాద్ ఐఎస్సదన్లో ప్రవీణ్ కుమార్ఇంటితో పాటు, బోయిన్పల్లిలోని ఆయన ఏజెంట్ మాధవరెడ్డి ఇంట్లో 35 మంది ఈడీ అధికారులు సెర్చ్చేశారు. వారి వ్యాపార లావాదేవీ లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పాస్పోర్ట్స్, ప్రాపర్టీస్ వివరాలు సేకరించారు. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఎమ్మెల్యేలతో దోస్తానీ
ప్రవీణ్కుమార్, మాధవరెడ్డికి రాష్ట్రంలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్నాయి. మాధవరెడ్డి కారుకు మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉంది. బోయినపల్లిలోని ఆయన ఇంట్లో సోదాలు జరుతున్న ఈడీ అధికారులు ఈ కారును కూడా గుర్తించారు. ఎమ్మెల్యేతో మాధవరెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీల వివరాలు రికార్డు చేసినట్లు తెలిసింది. ప్రవీణ్కుమార్కు అధికార పార్టీ నేతలతో మంచి లు న్న ట్లు తెలుస్తోంది. గత నెలలో జరిగిన తన బర్త్డే వేడుకలకు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేశాడని సమాచారం. ఈ వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నట్లు తెలిసింది.
ప్రవీణ్పై గతంలో కేసులు
సైదాబాద్ ఐఎస్ సదన్లో నివాసం ఉండే ప్రవీణ్కుమార్ 2017 అక్టోబర్21న హైదరాబాద్లోని హోటల్ మ్యారియట్లో పేకాట నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలతో పరిచయం ఉన్న ప్రవీణ్.. గోవా, నేపాల్, సింగపూర్, హాంకాంగ్లో క్యాసినో, పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టూర్స్ ప్యాకేజీలు డిజైన్ చేసి హీరోయిన్స్తో ప్రచారం చేయించేవాడు. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసేవాడు. గత నెల 10, 11, 12, 13 తేదీల్లో భారత్ నేపాల్ సరిహద్దుల్లో హోటల్ మేచీ క్రౌన్లో క్యాసినో నిర్వహించినట్లు సమచారం. కొన్ని కంపెనీలతో అగ్రిమెంట్చేసుకున్న ప్రవీణ్, మాధవరెడ్డి.. శ్రీలంక సంక్షోభంతో క్యాసినోను భారత సరిహద్దులకు షిఫ్ట్ చేశాడు. ఈ క్రమంలో హవాలా రూపంలో డబ్బు తరలించారనే సమాచారంతో ఈడీ సోదాలు చేస్తోంది.