తగ్గిన వంటనూనెల ధరలు

తగ్గిన వంటనూనెల ధరలు

న్యూఢిల్లీ: కస్టమర్లకు ఊరట కలిగించేలా పెద్ద కంపెనీలన్నీ వంట నూనెల రేట్లను 10–15 శాతం తగ్గించినట్లు సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ అసోసియేషన్​ (ఎస్​ఈఏ) సోమవారం తెలిపింది. అదానీ విల్​మార్​, రుచి సోయా సహా పెద్ద కంపెనీలన్నీ తమ మాగ్జిమమ్​ రిటెయిల్​ ప్రైస్​ (ఎంఆర్​పీ) ని తగ్గించాయని పేర్కొంది. ఇమామి, బుంగె, జెమిని, కోఫ్కో, ఫ్రిగోరిఫికో అల్లన, గోకుల్​ ఆగ్రో  కంపెనీలూ రేట్లను తగ్గించిన కంపెనీలలో ఉన్నాయని వెల్లడించింది. రేట్లు తగ్గించాలనే తమ ప్రపోజల్‌పై  లీడింగ్​ మెంబర్లందరూ సానుకూలంగా స్పందించడం సంతోషం కలిగిస్తోందని ఎస్​ఈఏ ఈ స్టేట్​మెంట్లో పేర్కొంది. ఇంపోర్ట్​ డ్యూటీలను తగ్గించిన నేపథ్యంలో సానుకూలంగా వ్యవహరించి, వంట నూనెల​ రేట్లు తగ్గించాలని కంపెనీలను ఫుడ్​ సెక్రటరీ సుధాంశు పాండే కోరిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఆవాల పంట రానుండటంతోపాటు, గ్లోబల్​గానూ రేట్లు దిగి వచ్చే సూచనలున్నాయని ఎస్​ఈఏ తెలిపింది. గ్లోబల్​గా రేట్లు ఎక్కువగా ఉండటంతో వంట నూనెల రేట్లు దేశీయంగానూ పెరిగాయని, ధరలను కిందకి తెచ్చేందుకు రిఫైన్డ్​, క్రూడ్​ ఎడిబుల్​ ఆయిల్స్​పై ఇంపోర్ట్​ డ్యూటీలను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.