పోటీ పరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తాం

పోటీ పరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తాం

రంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.4.5 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయాన్ని గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో గ్రంథాలయం నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సబిత చెప్పారు.

పోటీ పరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. దాతలు గ్రంథాలయాలకు సహకరించాలని, పెళ్లి, పుట్టినరోజు, శుభకార్యాల సమయాల్లో కుటుంబ సభ్యులు గ్రంథాలయంలో పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని మంత్రి కోరారు. ఇప్పటికే రూ.10లక్షలతో పుస్తకాలను కొనుగోలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, సురభి వాణిదేవి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాపాటి పాండురంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.