పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానం హుండీలను బుధవారం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ ఈఓ వీరేశం సమక్షంలో లెక్కించారు. వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు హుండీలను లెక్కించారు. 29 రోజులకు సంబంధించి రూ.39,87,178 ఆదాయం సమకూరింది.
