వనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిటకిట

వనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిటకిట

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో దుర్గమ్మ దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. అనంతరం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.