మెదక్​ జిల్లాలో.. ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం

మెదక్​ జిల్లాలో.. ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం

పాపన్నపేట, వెలుగు : మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు భారీగా తరలిరావడంతో ఏడుపాయల మహశివరాత్రి జాతరను తలపించింది.

మంజీర పాయల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. భక్తులు అధికంగా రావడంతో దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం పోసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.