
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhascker) తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi)’ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2018 జూన్ 29న విడుదలైన అయిన ఈ సినిమా యూత్ ను బాగా ఎంటర్టైన్ చేసింది. ఓ నలుగురు ఫ్రెండ్స్, వాళ్ల జీవితంలో ఎదురైనా పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నారు, ఒకరికి ఒకరు ఎలా అండగా నిలబడ్డారు అనేదే సినిమా.
చెప్పుకుంటే చాలా సింపుల్ కథ కానీ సినిమాలో చాల ఎమోషన్స్ ఉంటాయి. అందుకే ఈ మూవీ చాలా మందికి ఫేవరేట్. ఈ మూవీ ఇప్పుడు టీవీలో వచ్చినా టీఆర్పీ అదిరిపోతుంది. ఈ సినిమాకు ఆ రేంజ్లో క్రేజ్ ఉంది మరి. ఇక తాజాగా ఈ సినిమా లవర్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పారు ఈ నగరానికి ఏమైంది మేకర్స్. ఈ సినిమా విడుదల అయి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
జూన్ 29న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా విడుదల సమయలో చాలా మంది థియేటర్లో మిస్ అయ్యారు. తర్వాత థియేటర్లలో చూస్తే బాగుండేదని అనుకున్నారు. అలాంటివారికోసం ఇప్పుడు మరోసారి ఈ సినిమాను థియేటర్స్ లోకి రానుంది. ఈ న్యూస్ తెసులుకున్న మూవీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు.. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ రావడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.