డీఈఈ సెట్ పరీక్షకు సర్వం సిద్ధం

డీఈఈ సెట్ పరీక్షకు సర్వం సిద్ధం

హైదరాబాద్, వెలుగు: డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే డీఈఈ సెట్–2022 ఎగ్జామ్‌‌ శనివారం (ఈ నెల 23న) నిర్వహించనున్నట్టు డీఈసెట్ కన్వీనర్ శ్రీనివాస్ చారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,680 మంది స్టూడెంట్లు ఈ పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. ఇందులో తెలుగు మీడియం 4,967 మంది, ఇంగ్లిష్ మీడియం 5,348 మంది, ఉర్దూ మీడియం 1,365 మంది విద్యార్థులు ఉన్నట్టు పేర్కొన్నారు. తెలుగు మీడియం స్టూడెంట్లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం వారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్‌‌ ఉంటుందని తెలిపారు.