ఎమ్మెల్యే దిష్టిబొమ్మ కాంగ్రెస్ కార్యకర్తలు దహనం

ఎమ్మెల్యే దిష్టిబొమ్మ కాంగ్రెస్  కార్యకర్తలు దహనం

కందనూలు, వెలుగు : కాంగ్రెస్​ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే  మర్రి జనార్దన్ రెడ్డి  దిష్టిబొమ్మను తిమ్మాజీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్  కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్  ఎదుగుదలను ఎమ్మెల్యే  ఓర్వలేక పోతున్నారన్నారు.  ఎమ్మెల్యేలో ఓటమి భయం మొదలైందన్నారు.  కార్యక్రమంలో  దానం బాలరాజు, మాధవులు, హర్షవర్ధన్ రెడ్డి, దామోదరరెడ్డి, అశోకోగౌడ్, వెంకటయ్య, ఉస్మాన్  నాయకులు పాల్గొన్నారు. 

 ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలోని తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్  నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, కూచకుళ్ల రాజేశ్ రెడ్డి  హెచ్చరించారు. సోమవారం పట్టణంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.కార్యకర్తలను కాల్చి చంపుతానని బెదిరించడం పట్ల మండిపడ్డారు. ఎమ్మెల్యేపై అదనపు ఎస్పీ, తెలకపల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశామన్నారు.  సమావేశంలో   అర్థం రవి, హబీబ్, పాల్గొన్నారు.