గోదావరిఖని, వెలుగు : తెలంగాణ, చత్తీస్ గఢ్ కు చెందిన మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీకి చెందిన 8 మంది మావోయిస్టులు శనివారం గోదావరిఖనిలో రామగుండం పోలీస్కమిషనర్అంబర్ కిషోర్ఝా ఎదుట లొంగిపోయారు.
వీరిలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంత్, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా గంగులూరు పీఎస్ పరిధి గంపూర్గ్రామానికి చెందిన పోడియం కమురు, ముడియం జోగ, ముడియం భీమా, కుంజుం ఉంగా, ముడియం సుక్రం, ముడియం మంగు, కుంజం లక్కె ఉన్నారు.
2019 నుంచి ధర్మాజీ శ్రీకాంత్మావోయిస్టు కొరియర్ఉన్నారు. 2024లో వాజేడు పోలీసులు అరెస్ట్ చేయగా, 2025 మార్చిలో జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ మావోయిస్టు పార్టీలో చేరి మెంబర్గా పదోన్నతి పొందాడు. ఈయన తెలంగాణకు చెందిన కీలకనేతలు కంకణాల రాజిరెడ్డి, ఆజాద్, దామోదర్కు కొరియర్గా వ్యవహరించాడు.
పొడియం కమురు మిలీషియా కమాండర్గా ఉండి, కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పీఎస్ పరిధిలో 2024లో అరెస్ట్అయ్యాడు. 2025 మార్చిలో విడుదలై తిరిగి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. మిగిలిన ఆరుగురు చేతన నాట్య మండలి, మిలీషియా, జంగిల్ కమిటీ మెంబర్లుగా, స్థానికంగా సమాచార సేకరణలో కొరియర్లుగా వ్యవహరించారు. రివార్డు కింద వీరికి రూ.25 వేల చొప్పున నగదు చెక్కులను సీపీ అంబర్కిషోర్ఝా అందించారు.
