ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ పదో సీజన్‌‌‌‌లో..టైటాన్స్‌‌‌‌ ఎనిమిదో ఓటమి

 ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ పదో సీజన్‌‌‌‌లో..టైటాన్స్‌‌‌‌ ఎనిమిదో ఓటమి

నోయిడా :  కొత్త ఏడాదిలోనూ తెలుగు టైటాన్స్‌‌‌‌ ఆట మారడం లేదు. ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ పదో సీజన్‌‌‌‌లో చెత్తాటను కొనసాగిస్తూ టైటాన్స్ ఎనిమిదో ఓటమి మూటగట్టుకుంది. నోయిడా ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో పుణెరి పల్టన్ 54–-18తో టైటాన్స్‌‌‌‌ను చిత్తు చేసింది. ఏకంగా  36 పాయింట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది.

ఆ టీమ్ రైడర్ మోహిత్ గోయత్ (13 పాయింట్లు) చెలరేగగా, డిఫెండర్లు అభినేష్ నడరాజన్, గౌరవ్ ఖత్రీ హై ఫైవ్‌‌‌‌లతో ఆకట్టుకున్నారు. నాలుగుసార్లు ఆలౌట్‌‌‌‌ అయిన  టైటాన్స్ జట్టులో డిఫెండర్ సుదీప్ (5 పాయింట్ల) ఒక్కడే పోరాడాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 48–41తో యూపీ యోధాస్‌ను ఓడించింది.