తెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్
  • 5 వేల ప్రైమరీ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్.. 
  • నందన్ నీలేకని ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టెప్ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విద్యాశాఖ ఒప్పందం 
  • మరో 5 ప్రముఖ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీవోలతో సీఎం రేవంత్ సమక్షంలో ఎంవోయూలు 
  • ఫిజిక్స్ వాలా ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజీల్లో నీట్, జేఈఈ, క్లాట్ కోచింగ్
  • పైజామ్ ఫౌండేషన్ నేతృత్వంలో స్కూళ్లలో కోడింగ్,కంప్యూటేషనల్ థింకింగ్ శిక్షణ

హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రముఖ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీవోలతో విద్యాశాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగాయి. నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి ప్రసిద్ధ సంస్థలు ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో అత్యాధునిక ఎడ్-టెక్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా తమ కార్యక్రమాలను అమలు చేసిన ఈ సంస్థల భాగస్వామ్యంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీశ్ బాబు, ప్రజ్వల ఫౌండేషన్ డాక్టర్ సునీతా కృష్ణన్, ఫిజిక్స్ వాలా కో-ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్, పైజామ్ ఫౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్, ఎడ్యుకేట్ గర్ల్స్ సీఈవో గాయత్రి నాయర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంస్థలు అందించే సేవలు ఇవీ.. 

  • ఏక్‌ స్టెప్ ఫౌండేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రస్తుతం 540 పాఠశాలలలో పని చేస్తున్న ఈ సంస్థ.. ఇకపై 33 జిల్లాల పరిధిలోని 5 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విద్యార్థులకు నేర్పిస్తుంది. 
  • ఫిజిక్స్ వాలా: ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ శిక్షణ ఇస్తుంది.
  • ఖాన్ అకాడమీ: 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత స్టెమ్​(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణ అందిస్తుంది.
  • ప్రజ్వల ఫౌండేషన్: 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. 
  • పైజామ్ ఫౌండేషన్: 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శిక్షణ ఇస్తుంది.   
  • ఎడ్యుకేట్ గర్ల్స్: రాష్ట్రంలో చదువుకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్చటంతో పాటు బాలికల అక్షరాస్యత కోసం కృషి చేస్తుంది.