ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ 1,267 శాతం అప్‌‌‌‌‌‌‌‌ .. శ్రీరామ్ ఫైనాన్స్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ 1,267 శాతం అప్‌‌‌‌‌‌‌‌ .. శ్రీరామ్ ఫైనాన్స్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఏకంగా 1,267 శాతం వృద్ధి చెందాయి.  శ్రీరామ్ ఫైనాన్స్ మొబిలిటీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం, గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌లో 717 యూనిట్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో 9,804 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది మేతో పోలిస్తే మాత్రం ఒక శాతం గ్రోత్ మాత్రమే నమోదైంది.  

డిమాండ్ తగ్గడంతో  పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ కార్ల అమ్మకాలు పడ్డాయి. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో  ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయాలు 5శాతం పెరిగి  93,872 యూనిట్లకు చేరాయి. డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రక్ రెంటల్స్‌‌‌‌‌‌‌‌  ఏడాది లెక్కన 5 శాతం పెరిగాయి. ఈ ఏడాది మే  నెలతో పోలిస్తే జూన్‌‌‌‌‌‌‌‌లో  1.3శాతం పెరిగాయి. పెట్రోల్ వినియోగం 6.4శాతం పెరిగి 3.51 ఎంటీకి, డీజిల్ వినియోగం 1.2శాతం పెరిగి 8.08 ఎంటీకి చేరింది.