హమ్మయ్య ప్రమాదం తప్పింది: నిమజ్జనం లారీపై పడిన విద్యుత్​ స్థంభం

హమ్మయ్య ప్రమాదం తప్పింది: నిమజ్జనం లారీపై పడిన విద్యుత్​ స్థంభం
  • నిమజ్జనం లారీ పై పడిన కరెంట్​ పోల్

పద్మారావునగర్​, వెలుగు: వినాయకుడి నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న టస్కర్​ లారీపై సీతాఫల్​ మండి చౌరస్తాలో ఓ కరెంట్​ పోల్​ కూలింది.  టస్కర్​ లారీకి కట్టిన కర్రలు కరెంట్​ వైర్లకు తగలడంతో ఈ ఘటన జరిగింది. సమాయానికి అక్కడ ఎవరరూ  లేకపోవడంతో  ప్రమాదం తప్పింది.  రోడ్డు పక్కన ఉన్న ఓ పాన్​ డబ్బా కింద పడిపోయింది.  దీంతో కొంత సేపు ట్రాఫిక్​ నిలిచిపోయింది.  స్థానికులు చొరవ తీసుకొని, వెంటనే టస్కర్​ లారీ పై నుంచి కరెంట్​ స్తంబాన్ని పక్కకు తొలగించడంతో ట్రాఫిక్​ క్లియర్​ అయింది.