
-
నిమజ్జనం లారీ పై పడిన కరెంట్ పోల్
పద్మారావునగర్, వెలుగు: వినాయకుడి నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న టస్కర్ లారీపై సీతాఫల్ మండి చౌరస్తాలో ఓ కరెంట్ పోల్ కూలింది. టస్కర్ లారీకి కట్టిన కర్రలు కరెంట్ వైర్లకు తగలడంతో ఈ ఘటన జరిగింది. సమాయానికి అక్కడ ఎవరరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన ఉన్న ఓ పాన్ డబ్బా కింద పడిపోయింది. దీంతో కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు చొరవ తీసుకొని, వెంటనే టస్కర్ లారీ పై నుంచి కరెంట్ స్తంబాన్ని పక్కకు తొలగించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.