వారణాసి: అదొక ప్రైవేట్ స్కూల్. ఎక్కువలో ఎక్కువ ఇరవై గదులు. పగటిపూట మాత్రమే కరెంటు వాడతారు. సాయంత్రం తర్వాత వాచ్మెన్ తప్ప ఎవరూ ఉండరు. మహాఅయితే బిల్లు వేలల్లో వస్తుంది. ఈసారి మాత్రం ఏకంగా రూ.618కోట్లు కట్టాలంటూ విద్యుత్ శాఖ నోటీసులిచ్చింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసిలో వెలుగుచూసిన అధికారుల నిర్లక్ష్యమిది. యూపీ సర్కారు కరెంట్ చార్జీలు పెంచినరోజే.. వారణాసి వినాయకనగర్లో ఉన్న స్కూల్కి కోట్లలో బిల్లు రావడం చర్చనీయాంశమైంది.
దీనిపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సాఫ్ట్వేర్ సమస్యవల్లే బిల్లు కోట్లలో జనరేట్అయిందన్న అధికారులు.. అంత మొత్తాన్నీ ఈ నెల 7లోగా కట్టితీరాల్సిందేనని, లేకుంటే పవర్ కట్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో స్కూల్వాళ్లు సోషల్మీడియాలో తమ గోడువెళ్లబోసుకున్నారు. విషయం వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకిదిగినట్లు తెలిసింది. రెండేండ్లలో యోగి సర్కార్ రెండు సార్లు చార్జీలు పెంచింది.