618కోట్ల కరెంట్ బిల్లు : స్కూల్ కి నోటీసు పంపిన విద్యుత్​ శాఖ

618కోట్ల కరెంట్ బిల్లు : స్కూల్ కి నోటీసు పంపిన విద్యుత్​ శాఖ

వారణాసి: అదొక ప్రైవేట్​ స్కూల్​. ఎక్కువలో ఎక్కువ ఇరవై గదులు. పగటిపూట మాత్రమే కరెంటు వాడతారు. సాయంత్రం తర్వాత వాచ్​మెన్​ తప్ప ఎవరూ ఉండరు. మహాఅయితే బిల్లు వేలల్లో వస్తుంది. ఈసారి మాత్రం ఏకంగా రూ.618కోట్లు కట్టాలంటూ విద్యుత్​ శాఖ నోటీసులిచ్చింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసిలో వెలుగుచూసిన అధికారుల నిర్లక్ష్యమిది. యూపీ సర్కారు కరెంట్​ చార్జీలు పెంచినరోజే.. వారణాసి వినాయకనగర్​లో ఉన్న స్కూల్​కి కోట్లలో బిల్లు రావడం చర్చనీయాంశమైంది.

దీనిపై స్కూల్​ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సాఫ్ట్​వేర్​ సమస్యవల్లే బిల్లు కోట్లలో జనరేట్​అయిందన్న అధికారులు.. అంత మొత్తాన్నీ ఈ నెల 7లోగా కట్టితీరాల్సిందేనని, లేకుంటే పవర్​ కట్​చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో స్కూల్​వాళ్లు సోషల్​మీడియాలో తమ గోడువెళ్లబోసుకున్నారు. విషయం వైరల్​ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకిదిగినట్లు తెలిసింది. రెండేండ్లలో యోగి సర్కార్​ రెండు సార్లు చార్జీలు పెంచింది.