రోడ్డుపై ఏనుగుల గుంపు హల్ చల్.. భయాందోళనలో ప్రయాణికులు

రోడ్డుపై ఏనుగుల గుంపు హల్ చల్.. భయాందోళనలో ప్రయాణికులు

చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు గుంపు హల్చల్ చేసింది. పలమనేరు నుండి గుడియాత్తం వెళ్లే రహదారిలో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఏనుగుల గుంపు.. అటుగా వెళ్లే ప్రయాణికులకు భయాందోళన కలిగించాయి. రోడ్డుకు అటు ఇటు తిరుగుతూ గంటల కొద్దీ అక్కడే ఉండిపోయాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవిలోకి తరమడానికి ప్రయత్నించారు. రోడ్డుపై వాహనాలు తిరిగే చోట.. జనసంచారం ఉండే ప్రాంతాల్లో ఏనుగుల గుంపు రాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.