మాకు మనసుంది : గుంపులుగా వచ్చి పిల్ల ఏనుగుకు సంతాపం

మాకు మనసుంది : గుంపులుగా వచ్చి పిల్ల ఏనుగుకు సంతాపం

మనుషుల కంటే జంతువులే బెటర్ అంటుంటాం. అందుకు తగ్గట్టే ప్రవర్తించాయి కొన్ని ఏనుగులు. ప్రమాదవశాత్తు ఓ ఏనుగు చనిపోయింది. తట్టుకోలేని ఏనుగుల గుంపు ఒక్కసారిగా పిల్ల ఏనుగు దగ్గరకు చేరి సంతాపం తెలిపాయి. రోడ్డుపై చనిపోయిన పిల్ల ఏనుగు దగ్గరకు ఏనుగులు ఒకదాని వెనక ఒకటి రావడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారుల అరుపులతో చివరకు చనిపోయిన ఆ పిల్ల ఏనుగును తీసుకుని అడవిలోకి వెళ్లాయి. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు వీడియోతీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది.

మనుషులకే కాదు జంతువులు కూడా సంతాపం ప్రకటిస్తాయి.. వాటికి కూడా ఫీలింగ్స్‌ ఉంటాయి అంటున్నారు నెటిజన్లు.