
న్యూఢిల్లీ: దుబాయ్ యువరాణి షైకా మహ్రా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన ప్రకటన చేసింది. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా తన భర్త షేక్ మనా మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ కు ట్రిపుల్ తలాక్ చెప్పింది. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నందున మీకు నేను విడాకులు ఇస్తున్నాను. ఐ డైవర్స్ యూ.. ఐ డైవర్స్ యూ అండ్ ఐ డైవర్స్ యూ. టేక్ కేర్.. మీ మాజీ భార్య” అని ఇన్స్టాలో ఆమె ప్రకటించింది.
ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఆమె విడాకుల ప్రకటన చేయడం గమనార్హం. ఇన్స్టాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, వారు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురు షైకా. బ్రిటన్లో చదువుకున్న ఆమె.. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నది. షైకాకు వ్యాపారవేత్త షేక్ మనా హమ్మద్ బిన్ మనా అల్ మక్తూమ్తో 2023 మే 27న పెండ్లయింది. భర్తకు ఇతర మహిళతో సంబంధాలు ఉన్నాయని తెలిసి ఆమె విడాకులు ప్రకటించింది.