భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరగనున్న తొలి టీ20 రద్దయ్యింది. మూడు టీ20ల సిరీస్ లలో వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా క్యాన్సిల్ అయ్యింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడేసరికి టాస్ డిలే చేస్తున్నట్టు ఎంపైర్లు ప్రకటించారు . వర్షం తగ్గి మ్యాచ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో ఇవాళ జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ఎంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 నవంబర్ 20న జరగనుంది.