ముంబై: కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న జాబ్ మార్కెట్ పుంజుకుంటోంది. ఉద్యోగ నియామకాలు కిందటి ఏడాది మేతో పోలిస్తే ఈసారి మే నెలలో 40శాతం పెరిగాయి. మహమ్మారి వల్ల నష్టపోయిన టూరిజం సెక్టార్లోనూ హైరింగ్ జోరుగా ఉంది. జాబ్ పోర్టల్ నౌకరీ డాట్కామ్ స్టడీ రిపోర్టు ప్రకారం...వేసవి సెలవుల సీజన్తో ప్రయాణాలు పెరిగాయి. అందుకే పోయిన నెలలో ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్లో నియామకాలు బలంగా ఉన్నాయి. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో ప్రయాణాలు విపరీతంగా తగ్గాయి. అందుకే అప్పుడు నియామకాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ‘‘నౌకరీ జాబ్స్పీక్ మే22’’ ఇండెక్స్ ప్రకారం, 2022 మేలో నియామకాల్లో 40శాతం యాన్యువల్ గ్రోత్ కనిపించింది. నౌకరీ జాబ్స్పీక్ అనేది నెలవారీ ఇండెక్స్. ఇది నెలవారీ, ఏడాది ప్రాతిపదికన నౌకరీ డాట్కామ్ వెబ్సైట్లో జాబ్పోస్టింగ్స్ ఆధారంగా నియామక కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. "పోయిన సంవత్సరం పెద్ద బ్రేక్ తర్వాత టూరిజం పరిశ్రమ తిరిగి పుంజుకుంది యానువల్ గ్రోత్ 352 శాతం ఉంది. ఏప్రిల్తో పోల్చితే ఈ రంగం నిలకడగా ఉంటూ నెలవారీ రన్ రేట్ను కొనసాగించింది" అని రిపోర్టు పేర్కొంది. ఇతర సెక్టార్లలోనూ ఉద్యోగాలు బాగానే వచ్చాయి. రిటైల్ (175శాతం), రియల్ ఎస్టేట్ (141శాతం) బీమా సెక్టార్లో126శాతం జాబ్స్ పెరిగాయి. ఐటీ -సాఫ్ట్వేర్/సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమ అధిక బేస్ ఎఫెక్ట్ కారణంగా ఏడు శాతం పెరుగుదల మాత్రమే కనిపించింది.
చిన్న నగరాల్లోనూ ట్యాలెంట్కు డిమాండ్
మెట్రోలు నాన్-మెట్రోలలో ప్రతిభకు డిమాండ్ తగ్గడం లేదు. మేలో నియామకాలలో సంవత్సరం లెక్కన రెండంకెల గ్రోత్ను సాధించాయి. మెట్రోలలో, ఢిల్లీ (63శాతం) అత్యధిక యాన్యువల్ గ్రోత్ ఉంది. ముంబైలో ఇది 61శాతం రికార్డయింది. ఇతర మెట్రోలు కోల్కతా (59శాతం), చెన్నై (35శాతం), పూణే (27శాతం), హైదరాబాద్లో (23శాతం) కూడా సానుకూల గ్రోత్ కనిపించింది. అన్ని టైర్-2 నగరాల్లో నియామకాలు బాగున్నాయి. జైపూర్లో ట్యాలెంట్కు డిమాండ్ 76శాతం పెరిగింది. కోయంబత్తూర్ (64శాతం), వడోదర (49శాతం), కొచ్చిన్ (35శాతం), అహ్మదాబాద్ (26శాతం), చండీగఢ్ (25శాతం) లో రెండంకెల గ్రోత్ కనిపించింది.