
ఢిల్లీలోని BRT కారిడార్లో మంగళవారం (జూన్4) అర్థరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. వ్యాపారి అరుణ్ లోహియా హత్య కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలయ్యాయి. BRT కారిడార్ లోని CNG పంప్ సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అరుణ్ లోహియా హత్య కేసు నిందితుల్లో ఒకరైన దీపక్ అతని అనుచరుడితో కలిసి బైక్ పై షేర్ సరాయ్ ప్రాంతానికి వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే దీపక్, అతని అనుచరుడు పోలీసులపై కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి.
పోలీసుల సమాచారం మేరకు ముందస్తు సమాచారంలో షేర్ సరాయ్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు దీపక్, అతని అనుచరుడు బైక్ పై రాగానే పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. దుండగులు పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలయ్యాయి. నిందితులిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దీపక్.. మే 15న ఢిల్లీలోని ఛతర్ పూర్ ప్రాంతంలో జరిగిన వ్యాపార వేత్త అరుణ్ లోహియా హత్య కేసులు ప్రధాన నిందితుడు. స్కూటర్ నడుపుతున్న లోహియాపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చితూటాల వర్షం కురిపించారు. లోహియాపై 10నుంచి 12 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో లోహియా అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ కేసులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల బృందం నిందితులకోసం గాలిస్తోంది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు ఆపరేషన్ నిర్వహించారు. నిందితుల పట్టివేతతో లోహియా హత్యకేసుకు సంబందించిమరిన్ని అంశాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.