
శ్రీనగర్: కాశ్మీరీ పండిట్ ను చంపిన టెర్రరిస్టును భద్రతా బలగాలు ఇయ్యాల ఎన్కౌంటర్లో కాల్చిచంపాయి. హతమైన టెర్రరిస్ట్ పుల్వామాకు చెందిన అకిబ్ముస్తాక్భట్గా పోలీసులు గుర్తించారు. పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇవ్వాల అర్ధరాత్రి1:30 గంటలకు భద్రతా దళాలు ఎన్కౌంటర్ స్టార్ట్చేసి ముస్తాక్భట్ను మట్టుబెట్టాయి. మొదట్లో హిజ్బుల్ముజాహిదీన్ కోసం పనిచేసిన భట్.. ప్రస్తుతం ‘ది రెస్టిస్టెన్స్ఫ్రంట్’(టీఆర్ఎఫ్) అనే ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని, సంజయ్శర్మ అనే పండిట్ ను చంపిన టెర్రరిస్టుల్లో భట్ఉన్నట్లు గుర్తించామని కాశ్మీర్ అదనపు డీజీపీ తెలిపారు. కాగా బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్సంజయ్ శర్మ ఆదివారం మార్కెట్కు వెళుతుండగా ఉగ్రవాదులు కాల్చిచంపారు.