
భారత యువతను గత కొన్నేళ్లుగా పట్టిపీడుస్తున్న భూతం లోన్ యాప్స్. మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచుల్లా లోన్ యాప్స్ మారిపోయాయి. దేశ వ్యాప్తంగా రోజుకో చోట తీసుకున్న అప్పు కట్టలేదంటూ యాప్స్ యాజమాన్యం పెట్టే టార్చర్ కి తట్టుకోలేక బాధితుడి చావుకు కారణం అవుతున్నాయి. డబ్బులు లేకపోతే తమ యాప్ లో తీసుకోమని సలహా ఇస్తూ యూజర్ల అవసరాలను క్యాచ్ చేస్తూ తమ మాయలోకి లాగుతున్నారు.
గేమ్లు ఆడేందుకు అప్పుగా తీసుకున్న డబ్బును క్లియర్ చేయాలంటూ ఒత్తిడి చేయడంతో 20 ఏళ్ల ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థి సోమవారం గుడిమల్కాపూర్లోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ఏజెంట్లు అతన్ని వేధిస్తున్నారని బాధితుడి కుటుంబం కూడా ఆరోపించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్, దుండిగల్లో మూడో సంవత్సరం చదువుతున్నాడు సేలం మనోజ్. మనోజ్ ఆన్లైన్ గేమ్లు ఆడటానికి అలవాటు పడి పలు యాప్స్ లో లోన్స్ తీసాడాని కుటుంబ సభ్యులు తెలిపారు.
మనోజ్ లోన్ యాప్ల నుండి సుమారు రూ. 60 వేలు తీసుకున్నాడని, దానిని క్లియర్ చేయడానికి మరికొన్ని వాటిని నుంచి రుణం తీసుకోవడం ప్రారంభించాడని తండ్రిబాలృష్ణ చెప్పాడు. లోన్ యాప్ ప్రతినిధుల చిత్రహింసల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. మనోజ్ చనిపోయిన స్పాట్ లో ఎలాంటి సూసైడ్ దొరక లేదని పోలీసలు తెలిపారు.
నవంబర్లో అతని తండ్రి బాలకృష్ణ తన స్నేహితుల ద్వారా గేమింగ్ లోన్ తీసుకున్న విషయం తెలుసుకుని 3 లక్షలు క్లియర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. లోన్ యాప్ వేధింపుల గురించి కుటుంబ సభ్యులు తమకు చెప్పలేదని అన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.