97 KGBV ల్లో ఇంగ్లిష్ మీడియం

97 KGBV ల్లో ఇంగ్లిష్ మీడియం

రాష్ట్రంలోవచ్చే విద్యాసంవత్సరం నుంచి 97 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఇంగ్లిష్‌ మీడియం తరగతులు ప్రారంభం కానున్నాయి . ఒక్కోస్కూల్లో 40 మంది విద్యార్థి నులకు ఆరో తరగతిలో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకుడీఈవోలకు ఆదేశాలిచ్చారు. విద్యార్ థులు తక్కువ ఉండటంతో ఇప్పటి వరకు తెలుగు మీడియం క్లాసు లు నడిచాయి. పేరెంట్స్‌‌ విజ్ఞప్తితో 97 కేజీబీవీల్లో ఇంగ్లిష్​ మీడియం తరగతులు ప్రారంభిం చాలని విద్యాశాఖ నిర్ణయించిం ది. ఆదిలాబాద్, కుమ్రంభీం,మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ని కేజీబీవీల్లో ఈ ఉత్తర్వు లు అమలు కానున్నాయి .