ఏసీబీ వలలో ఏన్కూర్​ తహసీల్దార్

ఏసీబీ వలలో ఏన్కూర్​ తహసీల్దార్

తల్లాడ, వెలుగు : ఖమ్మం జిల్లా ఏన్కూర్ తహసీల్దార్​ఎస్​కే ఖాసీం ఏసీబీకి చిక్కారు. మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బానోతు బుజ్జా అనే మహిళ తన పొలంలోని 24 గుంటలను తన కొడుకైన రామకృష్ణ పేరు మీదకు మార్చాలనుకుంది. దీనికి గాను పట్టా పాస్ బుక్ ఇచ్చేందుకు తహసీల్దార్​ రూ.3 వేల లంచం డిమాండ్ చేశాడు. 

దీంతో రామకృష్ణ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.3వేలను గురువారం తహసీల్దార్​ఆఫీసులో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అలాగే ఖమ్మం సిటీలోని చెరువు బజార్​లో ఉన్న తహసీల్దార్​ఇంట్లోనూ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణ, సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలోని ఏసీబీ అధికారుల తనిఖీలు చేశారు.