కల్లు తాగిన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

కల్లు తాగిన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

రాయపర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి నుంచి ఆదివారం వరంగల్‌‌ జిల్లా రాయపర్తి మండలం బురహన్‌‌పల్లి వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు మధ్యలో ఓ గీత కార్మికుడిని చూసి ఆగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని తెలుసుకున్నారు. తర్వాత కల్లు తాగాలని గీత కార్మికుడు అడగడంతో టేస్ట్‌‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మృతుల ఫ్యామిలీలకు పరామర్శ

పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్‌‌ ధరావత్‌‌ లాలు, దేవరుప్పులకు చెందిన ఎడవెల్లి కౌసల్య అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు ఆదివారం మృతుల ఫ్యామిలలను పరామర్శించారు. ధర్మాపురం గ్రామానికి చెందిన ముత్యాల కనకమ్మ చనిపోవడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.