అన్ని ఎమ్మెల్సీ స్థానాల గెలుపు టీఆరెస్ కు నల్లేరు మీద నడకే అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అంతేకాదు.. MPTCల గౌరవ వేతనం పెంచామని.. అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు. స్థానిక సంస్థల స్థానం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరుపున.. జడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. రెచ్చగొట్టే నేతలకు ఎంపీటీసీలు సరైన సమాధానం చెప్పాలన్నారు. ఏకగ్రీవం అయ్యేలా అందరూ కృషి చేయాలన్నారు.
వరంగల్ జిల్లా అంటే కేసీఆర్ కు అభిమానమని.. అందుకే ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు వరంగల్ కు ఇచ్చారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. స్థానిక సంస్థలను బలోపేతం చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నకోవాలని పార్టీ నేతలను కోరారు.