
న్యూఢిల్లీ: ఇండోనేసియాలోని బాలి ఎయిర్ పోర్ట్ దగ్గర్లో ఉన్న మౌంట్ లెవోటోబీ లకీ-లకీ అగ్నిపర్వతం బద్దలవడంతో బుధవారం ఢిల్లీ నుంచి బాలికి వెళ్లిన ఎయిరిండియా విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం సేఫ్గా ల్యాండ్ అయిందని ఎయిరిండియా అధికారులు వెల్లడించారు. ప్యాసింజర్లు అందరూ సురక్షితంగా ఉన్నారని..వారికి హోటల్ లో బస ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే టికెట్ రద్దు చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ లేదా ఉచితంగా రీషెడ్యూలింగ్ సౌకర్యం కల్పించినట్లు ఎయిరిండియా వివరించింది.