
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లోని వేర్వేరు ప్రాంతాల్లో వాటర్బోర్డు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.వివిధ అవసరాల కోసం ఇంటి నుంచి బయటకి వచ్చే జనం దాహార్తిని తీర్చేందుకు మెయిన్హాస్పిటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో తాగునీటిని అందిస్తోంది. ఓఆర్ఆర్ పరిధిలో 70, జీహెచ్ఎంసీ పరిధిలో 31 కలిపి మొత్తం 101 చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నాలుగు కేంద్రాలను ప్రారంభించింది. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం చార్మినార్లోని మక్కా మసీదు వద్ద వాటర్క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే వారికి బాటిళ్లు, ప్యాకెట్ల ద్వారా నీరు అందజేయనుంది. అలాగే సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లోని మసీదుల వద్ద స్టాళ్లు ఏర్పాటు చేయనుంది.