రేపు అసెంబ్లీలో కరోనాపై చర్చ …

రేపు అసెంబ్లీలో కరోనాపై చర్చ …

రేపు అసెంబ్లీలో కరోనాపై చర్చ ఉంటుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రతతో… రాష్ట్రంలో ప్రభుత్వం అలర్ట్ గా ఉందన్నారు ఈటల. కరోనా కేసుల కోసం గాంధీలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. కరోనా టెస్టుల కోసం అత్యాధునిక లేబరేటరీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు మంత్రి. రాష్ట్రంలో కరోనా తీవ్రత లేదని…రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.