
- ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరిక
- ఫతుల్లాగూడ చెరువు పరిశీలన
ఎల్బీనగర్, వెలుగు: చెరువులను ఆక్రమిస్తే సీరియస్యాక్షన్ఉంటుందని, క్రిమినల్ కేసులు పెడతామని ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. నాగోలు డివిజన్ లోని ఫతుల్లాగూడ చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆయన మేడ్చల్, రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించారు.
చెరువు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తొలగించారని, తప్పడు సర్వే నంబర్లతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని స్థానికులు కమిషనర్దృష్టికి తెచ్చారు. స్థానిక వీఆర్ఏ కొడుకు కబ్జాకు సహకరిస్తున్నట్లు తెలిపారు. డాక్యుమెంట్లను పరిశీలించి మూడు రోజుల్లో లీగల్ యాక్షన్ తీసుకుంటానని రంగనాథ్వారికి తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై సీరియస్అయ్యారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఫత్తుల్లాగూడ చెరువును డ్రోన్ ద్వారా సర్వే చేయించారు. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ప్లానర్ కె.శ్రీనివాస్, రిజినల్ ఫైర్ అధికారి పాపయ్య పాల్గొన్నారు.