కేరళ తీరంలో సింగపూర్ షిప్ లో భారీ పేలుడు

కేరళ తీరంలో సింగపూర్ షిప్ లో భారీ పేలుడు

కేరళ కొచ్చి తీరంలో భారీ ప్రమాదం జరిగింది. జూన్ 9న ఉదయం సింగపూర్ కు చెందిన  కంటైనర్ షిప్ లో  మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గల్లంతు కాగా..మరో ఐదుగురు  సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.  మండుతున్న షిప్ నుంచి మరో 18 మంది సిబ్బందిని భారత నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించాయి.

270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన ఈ కంటైనర్  షిప్ ఎంవీ వాన్ హై 503  జూన్ 7న కొలంబో నుంచి బయలుదేరి జూన్ 10న ముంబై చేరుకోవాల్సి ఉంది.  అయితే ఇవాళ ఉదయం 10.30 గంటలకు కేరళ సమీపానికి చేరుకున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన భారత నేవీ ఐఎన్ఎస్ సూరత్ ను మండుతున్న కంటైనర్ దగ్గరకు మళ్లించారని రక్షణ అధికారి తెలిపారు. 

ALSO READ | ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చైనా షాక్.. ఎక్కువగా నష్టపోనున్న ఈవీ కంపెనీలు

ఇటీవల కేరళలోని కొచ్చి తీరం సమీపంలో లైబీరియాకు చెందిన ఒక భారీ కార్గో ఓడ  సముద్రంలో మునిగిన సంగతి తెలిసిందే. ఈ ఓడలో ఉన్న 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కాపాడింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియన్ నేవీ, కేరళ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎంఏ) కూడా పాల్గొన్నాయి. ఈ ఓడలో 640 కంటైనర్లు, 84.44 టన్నుల డీజిల్, 367.1 టన్నుల ఫర్నస్ ఆయిల్ ఉన్నాయి. ప్రమాదకర కెమికల్స్ ఉన్నాయి. 

#WATCH | MV WAN HAI 503 on passage from Colombo to Nhava Sheva reported an explosion under deck in position 315, Kochi 130. 04 crew reported missing and 05 crew injured. The ship was carrying containerised cargo with a total crew of 22. CGDO on task diverted for assessment. ICGS… pic.twitter.com/HLCZRlKoAo

— ANI (@ANI) June 9, 2025