కిరాణా షాపులో ఎక్కువగా కొనే ఈ వస్తువుల ధరలు తగ్గవు.. జీఎస్టీ తగ్గినా పాత ధరలే కొనసాగింపు..

కిరాణా షాపులో ఎక్కువగా కొనే ఈ వస్తువుల ధరలు తగ్గవు.. జీఎస్టీ తగ్గినా పాత ధరలే కొనసాగింపు..
  • రూ.5, రూ.10 ప్యాక్స్ ఎవర్​గ్రీన్ కంపెనీలకు వెన్నెముక
  • ఈ ప్యాక్స్​తో భారీగా అమ్మకాలు


న్యూఢిల్లీ:  కిరాణా షాపులో అడుగుపెట్టిన వెంటనే మెజారిటీ కస్టమర్లు మొదట చూసేది రూ.5, రూ.10 ప్యాక్‌‌‌‌ల ​వైపే! ఎందుకంటే వీటి ధర తక్కువ. కొనడం ఈజీ. తీసుకెళ్లడం సులువు. చిల్లర సమస్య ఉండదు. కంపెనీలకు ఈ సంగతి చాలా బాగా తెలుసు కాబట్టే వీటిని అవి సైకలాజికల్​ యాంకర్స్ అని పిలుస్తాయి. కొనుగోలుదారుణ్ని తమ రెగ్యులర్​ కస్టమర్​గా మార్చుకోవడానికి బడ్జెట్​ప్యాక్​లు కీలకం. అందుకే మనదేశ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీలు రూ. 5, రూ. 10 ధరలను చాలాకాలంగా మార్చడం లేదు. 

ఇక నుంచీ మార్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ ప్యాక్స్​ అన్ని వర్గాల కస్టమర్లను చేరుకోవడానికి సాయపడతాయి. సామాన్య వినియోగదారులకు అందుబాటు ధరను అందించి, భారీ అమ్మకాలను సాధిస్తాయి. ఈ ధరలను నిలబెట్టుకోవడానికి కంపెనీలు ధరను పెంచకుండా, సైజును తగ్గిస్తాయి. దీనిని గ్రామేజీ తగ్గింపు అంటారు.  

జీఎస్​టీ తగ్గింపు వల్ల ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, కంపెనీలు ధరలను మార్చడానికి ఇష్టపడటం లేదు. ధర మార్పు వల్ల ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్,​ లాజిస్టిక్స్​లో సమస్యలు వస్తాయి. అందుకే, ధరను తగ్గించకుండా, అదే ధరకు ఎక్కువ ఉత్పత్తిని అందిస్తూ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. 

ఏ కోణంలో చూసినా..

అన్ని ప్రాంతాల్లోనూ రూ. 5, రూ. 10 ధరలు చాలా ముఖ్యమైనవి. ఈ ధరలు వినియోగదారులకు సులభంగా అర్థమవుతాయి.  నగదు లావాదేవీలకు అనుకూలంగా ఉంటాయి.  సబ్బు, నూడుల్స్, చాక్లెట్​, పెరుగు వంటి ఏ ఉత్పత్తి అయినా రూ. 10 ప్యాక్​ వెంటనే అమ్ముడుపోతుంది. ఇదే ఉత్పత్తికి రూ. 15 ధర పెడితే అమ్ముడుపోదు.  ఐదు రూపాయల తేడాతోనూ సమస్యలు వస్తాయి. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ పరిశ్రమలో బ్రాండ్​కు క్వాలిటీ, సైజు కంటే ధరకు ఎక్కువ లాయల్టీ ఉంటుంది. 

ఒక బ్రాండ్ ధర పెంచితే, వినియోగదారులు వెంటనే తక్కువ ధరలో ఉన్న మరో బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మారతాడు. అందుకే కంపెనీలు తమ మార్కెట్​ను కాపాడుకోవడానికి ఈ ధరలను మార్చవు. కొన్నేళ్ల కిందట రూపాయి,  రూ. 2 ప్యాక్స్​ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు రూ. 5, రూ. 10 అయ్యాయి.  వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడమే ఇందుకు కారణం. భవిష్యత్తులో రూ. 10 కనీస ధరగా మారే అవకాశం ఉంది. ఈ ధరలు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీల మనుగడ, విజయం కోసం అత్యవసరమైనవని ఎఫ్​ఎంసీజీ కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​  ఒకరు చెప్పారు.