కేటీఆర్ శంకుస్థాపన చేసిన పనులకూ నిధుల్లేవ్

కేటీఆర్ శంకుస్థాపన చేసిన పనులకూ నిధుల్లేవ్

మేడిపల్లి, వెలుగు :  మంత్రి కేటీఆర్ ​శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకు కూడా నిధులు లేక మధ్యలోనే ఆగిపోయాయి. వర్షాకాలంలో పీర్జాదిగూడలోని పలు కాలనీలను బోడుప్పల్ నుంచి వచ్చే వర్షపు నీరు ముంచెత్తుతోంది. దీంతో ఆ నీరు పీర్జాదిగూడ వైపు రాకుండా బోడుప్పల్ చెరువు నుంచి మూసీ వరకు పైప్ లైన్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఎన్ డీపీ నిధులు రూ.110 కోట్లతో నిర్మించే ఈ పనులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేటీఆర్​శంకుస్థాపన చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మార్చిలో పనులు మొదలుపెట్టారు. అయితే, నిధులు లేకపోవడంతో చేసేదేమీలేక పనులను మధ్యలోనే వదిలేశారు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి, మళ్ళీ వర్షాకాలం వస్తే తమ పరిస్థితిపై పీర్జాదిగూడ వాసులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన పనులకు కూడా నిధులు లేకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేసి ఆగిపోయిన పనులను పూర్తిచేయాలని వారు కోరుతున్నారు.