హైదరాబాద్, వెలుగు: ఈవెంట్ ఇండస్ట్రీ వృత్తి నైపుణ్యంతో పని చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. కొంపల్లి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డేటా ఈవెంట్ ప్లానింగ్ ప్లాట్ఫారమ్ 'ఈవెంట్ నీడ్జ్'ను టీ –హబ్లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మెరుగైన పనితీరుతో అంచనాలకు తగ్గట్టు శాస్త్రీయంగా బడ్జెట్ను అంచనా వేయాలన్నారు.
టెక్నాలజీ సవాళ్లను పరిష్కరిస్తుందని, టెక్నాలజీపై పట్టు పెంచుకోవడం ఈవెంట్ ఇండస్ట్రీ అసోసియేషన్ల బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ నీడ్జ్ - కొంపల్లి డేటా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ ఎండీ సీఈవో జ్యోత్స్న కొంపల్లి మాట్లాడుతూ మీటింగ్స్, పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలను తాము నిర్వహిస్తామని చెప్పారు.