
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్ రఘునాథ్ యాదవ్ సోదరుడు సాయిరాం యాదవ్ బర్త్ డే వేడుకలు బుధవారం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ.. మా ప్రతి అడుగు జనం కోసమేనని.. ప్రతి నిమిషం ప్రజా సేవకే అంకితమన్నారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.